Bheemla Nayak : అసలు ఊహించని విధంగా ఓ సడెన్ అప్డేట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు నటించిన చిత్రం “భీమ్లా నాయక్” రిలీజ్ కి సంబంధించి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు. కేవలం 10 రోజులు ముందే అనౌన్స్ చేసినా ఈ సినిమా పై హైప్ ఏ లెవెల్లో ఉందో ఒక్కసారిగా అందరికీ అర్ధం అయ్యింది.
దీనితో అక్కడ నుంచి సాలిడ్ హైప్ ని ఇండస్ట్రీ లో సెట్ చేసుకున్న ఈ సినిమా విషయంలో కొంతమంది నెటిజన్స్ బాగా నెగిటివ్ గా ఉన్నారు. దీనితో ఈ సినిమాని చూడడం జరగదని కొన్ని పేస్ బుక్ పేజెస్ వారు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంత సడెన్ గా భీమ్లా నాయక్ పై నెటిజన్స్ ఎందుకు విరుచుకుపడుతున్నారో దానికి గల షాకింగ్ కారణం కూడా తెలుస్తుంది.
ఈ సినిమాపై వారు ఇంతలా కోపం తెచ్చుకోవడానికి కారణం ఈ సినిమా నిర్మాత నాగ వంశీ నే కారణం అట. లేటెస్ట్ గా తన “డీజే టిల్లు” సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమా చూసే ఆడియెన్స్ ని చాలా చిన్న చూపు చూస్తూ మాట్లాడాడని ఇంత అహంకారంతో సినిమా చూసే ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతారా అని పెద్ద ఎత్తున మండి పడుతున్నారు.
దీనితో ఇవి చూసిన మరికొంతమంది భీమ్లా నాయక్ ని తాము బాయ్ కాట్ చేస్తున్నామని అంటున్నారు. అయితే ఇది అన్నది డీజే టిల్లు సినిమా విషయంలో అయినా భీమ్లా నాయక్ సినిమాపై ఇప్పుడు వీరంతా పడ్డారు. మరి దీని వల్ల సినిమాపై ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందో లేదో కానీ సోషల్ మీడియాలో యంత్రం నిర్మాత మాటలు వైరల్ అవుతున్నాయి.
