ప్రస్తుత జీవినంలో చేసే పని మీద ఉండే శ్రద్ధ తినే తిండి మీద ఉండటం లేదు. ఆహారం తీసుకునే వేళల్లో తీవ్రమైన మార్పులు సంబవిస్తున్నాయి. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు చాలామంది ఉద్యోగులు. ఇక ఆ ఒత్తిడిలో పడి సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. వేళకు ఏదో ఒకటి అని చెప్పి.. తీసుకోవడంతో తీవ్ర అనారోగ్యాలకు పాల్పడుతున్నారు. ముందుగా ఎసిడిటీతో మొదలైన వ్యాధులు.. గుండె పోటుదాకా కూడా వెళ్తోంది. అయితే గుండె పోటు రావడానికి కంటే ముందు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఆ సమయంలో అప్రమత్తంగా ఉంటే.. ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అలాంటి లక్షణాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..
1. మొదటగా ఛాతిలో మంట అనిపిస్తుంటుంది. సాధారణంగా తినే ఆహారంలో కాస్తంగ ఎక్కువ మాసాలా వేసుకుంటే కూడా ఛాతిలో మంట అనిపిస్తుంది. కానీ దీంతో పాటు మరో లక్షణం కనిపించినప్పుడే.. అది గుండెపోటకు సూచిక అని గుర్తుంచుకోండి.. అదే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది.
2.శ్వాసతీసుకోవడంలో ఇబ్బందికి గురవుతారు. ఒకటి, రెండు ఒకేసారి కనిపిస్తాయి. అటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
3.ఇక చిన్న చిన్న పనులు చేసిన వెంటనే నీరసపడిపోతార. కొద్ది దూరం నడిచినా.. ఆయాసం వస్తుంటుంది.
4.మెడ, ముందు దవడలో నొప్పిగా ఉంటుంది.
5.ఎడమ చేయి తీవ్రమైన నొప్పితో బాధపడతారు. లేదా రెండు చేతులు కూడా నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం అయి డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది.
