కరోనా నుంచి కోలుకున్నా.. వెంటాడుతున్న ఆరోగ్యసమస్యలు..?

కరోనా ప్రపంచ దేశాలన్నింటిని గడగడా వణికించేసింది. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నింటిలో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం తీవ్రస్థాయి ఉన్నాయి. ఇప్పటికీ ఈ మహమ్మారి వివిధ రకాల వేరియంట్ లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కరోనా సోకిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే దాని నుండి ప్రాణాలను కాపాడుకున్న వారికి కూడా ఆరోగ్య సమస్యలు తప్పట్లేదు.కరోనా నుండి కోరుకున్నవారు పూర్తిగా దాని నుండి కోలుకున్నట్టు కాదని ఇంకా covid 19 లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రధానంగా కరోనా మహమ్మారి శరీరంలోని ఊపిరితిత్తుల పై దాడి చేయడం వల్ల కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం ఉండటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఊపిరితిత్తులు దెబ్బ తినటం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా అయ్యే అవకాశం ఉండదు.

కరోనా మహమ్మారి మెదడుపై దాడి చేయడం వల్ల దీని నుండి కోలుకున్న తర్వాత కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, వారి మానసిక స్థితి సరిగా లేకపోవటం వంటి సమస్యలు ఉంటాయి. కరోనా వల్ల మెదడులో రక్తం గడ్డ కట్టి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా నుండి కోలుకున్న తర్వాత నరాల బలహీనత వంటి సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి.

అందువలన కరోనా తగ్గిపోయింది కదా అని అని విచ్చలవిడిగా తిరగకుండా మాస్కులు వాడటం, సామాజిక దూరం పాటించటం, తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం వల్ల కలకాలం ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.