Ram Gopal Varma : షాకింగ్ : పవన్ పై బన్నీ ఫ్యాన్స్ ని ఉసిగొల్పుతున్న దర్శకుడు.!

Ram Gopal Varma : జస్ట్ గత కొన్నాళ్ల నుంచి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ కి మరియు అల్లు వారి ఫ్యామిలీ కి సరిగ్గా పడట్లేదు అని కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా “పుష్ప” తో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ హిట్ కొట్టడంతో అల్లు వారి డామినేషన్ స్టార్ట్ అయ్యిందని ఎవరిమట్టుకు వారు చాలానే అనుకున్నారు.

అయితే తన సినిమాల వరకు నటించడం ప్రీ రిలీజ్ ఫంక్షన్ మినహా వేరే ఏ ఇతర అంశాల్లో కూడా అంతగా ఆసక్తి చూపని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరియు అల్లు అర్జున్ కి ఆ మధ్య కొద్దిపాటి కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇది వారికి పర్సనల్ గా పెద్దది కాకపోయినా అభిమానుల్లో మాత్రం కలకలం రేపింది. ఇక ఇప్పుడు మళ్ళీ అంతా బాగానే ఉంది అనుకుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెడుతున్న కొన్ని ట్వీట్ లు సంచలనం రేపుతున్నాయి.

ఇన్ డైరెక్ట్ గా పవన్ కంటే అల్లు అర్జున్ నే ఎక్కువ.. అంటూ ఇరు హీరోల అభిమానులకు గొడవలు పెట్టే తరహాలో చెబుతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాకే ఈ రేంజ్ లో ఉంటే నీ భీమ్లా నాయక్ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేసి నీ పవర్ ఏంటో చూపించండి. అల్లు అర్జున్ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకి పవన్ అభిమాని అయ్యిన నేను సమాధానం చెప్పలేకపోతున్నానని ఓ రేంజ్ లో సెటైర్స్ వేస్తూ ట్వీట్స్ పెట్టాడు.

ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి.

ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారూ??? అంటూ ఈ రేంజ్ లో వేస్తున్నాడు. మరి దీని వెనుక ఏం ప్లానింగ్ ఉందో వర్మకే తెలియాలి.