ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికి.. అతడి పక్కనే నిద్రించిన ప్రియురాలు!

సమాజంలో జరిగే కొన్ని అఘాయిత్యాలు, కొన్ని సంఘటనలు ఇలా ఉంటాయి అంటే అవి వినగానే ఒళ్ళు గగుర్పొడిచే అంత భయంకరంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా హత్యలకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి భయంకరమైన ఘటన ఒకటి పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కరాచీలోని సర్దార్ ప్రాంతంలో పాత అపార్ట్మెంట్ భవనంలో ఒక ఫ్లాట్ దగ్గర మనిషి భాగాలు పడి ఉన్నాయని ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు వార్తలు బలవంతంగా తెరిచి చూడగా, ఒక మహిళ గాఢనిద్రలో ఉందని, ఆమెకు దగ్గరలోనే శరీరభాగాలు ముక్కలుముక్కలుగా చేసి ప్లాట్ అంత పడేశారని సీనియర్ పోలీసు అధికారి జుబెయిర్ నజీర్ షైక్ తెలిపారు. అయితే ఈ హత్య కేసులో 45 ఏళ్ల మహిళను ప్రధాన నిందితురాలుగా అనుమానిస్తున్నారు.

ఈ హత్య మూడు, నాలుగు రోజుల కిందట జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రక్తంతో తడిసి ముద్దయిన బట్టలు, అలాగే ముక్కలు చేయడానికి ఉపయోగించిన సామాన్లు లభించడంతో ఆ మహిళను అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సుత్తి కత్తి ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారట. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెబుతోందట. మొదట తన భర్త అని చెప్పిన ఆమె ఆ తరువాత తన భావ అని తెలిపింది. మత్తులో ఉన్న ఆమెకు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇరుగు పొరుగు వారు అందించిన సమాచారం మేరకు వారు ఇద్దరూ కలిసి సహజీవనం చేసినట్లు తెలిపారు.