తెలంగాణ రాష్ర్ర్ట మంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన మంత్రిని బంజారా హిల్స్ కేర్ సుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతోంది. సబిత ఆరోగ్యం నిలకడగా ఉందని..భయపడాల్సిన పనిలేదని డాక్టర్లు తెలిపారు. మంత్రి ఆరోగ్యంపై మంత్రులు, నేతలు, కుటుంబ సభ్యులుఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సబిత ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అంతకు ముందు సబిత అస్వస్థత విషయం తెలుసుకు అభిమానులు, కార్యకర్తలు, అనుచరలు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి చేరుకుని ఆందోళ చెందారు. ఆసుపత్రి వద్ద కాసేపు అలాంటి వాతావరణమే కనిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే సబిత ఆరోగ్యం సరిగ్గా లేదని రెండు, మూడు నెలల క్రితం ప్రచారంలోకి వచ్చింది. దీంతో అప్పుడే అభిమానులు ఆందోళన పడ్డారు. తాజా ఘటనతో మరింత కలకలం రేగుతోంది. దీనికి తోడు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇప్పటివరకూ స్పందిచకపోవడంతో అభిమానుల్లో కంగారు మొదలైంది.