Megastar Chiranjeevi : టాలీవుడ్ బిగ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి కి ఈరోజు ఉదయమే ఏపీ ముఖ్యమంత్రి ఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిందన్న వార్త పెద్ద ఎత్తున సెన్సేషన్ గా మారింది. గత కొన్నాళ్ల నుంచి ఏపీలో వీడని సమస్యగా మారిన టికెట్ ధరల సమస్య పై ఒక పరిష్కారాన్ని తీసుకొస్తారని అంతా ఆశిస్తుండగా ఈ సమయంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఈ భేటీ ముగిసిపోయింది.
అయితే ఈ మీటింగ్ పట్ల ఆల్రెడీ కింగ్ నాగార్జున కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మాటలు నిజం అయ్యేలానే ఉన్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది. అసలు ఈ మీటింగ్ అయ్యాక మెగాస్టార్ పలు ఆసక్తికర అంశాలనే వెల్లడించారు. “జగన్ నన్ను పిలిచి రెండు వైపులా కూడా ఉన్న సమస్యలని వినాలని అన్నారు.
ఆయన పిలుపు నాకు ఏంతో బాధ్యతగా అనిపించింది. ఇంకో వారం లేదా పది రోజుల్లో కొత్త జీవో కూడా రావొచ్చని అలాగే ఏపీలో 5వ షో పై కూడా పునరాలోచన చేస్తానని తెలిపారు. ఇంకా అందరికీ కూడా ఉపయోగపడే నిర్ణయాన్నే తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని” చిరు ఈ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడి తెలిపారు.
