ఇన్సైడ్ టాక్ : మహేష్ సినిమాకి ఏపీ ప్రభుత్వం లైన్ క్లియర్ చేసేసిందా.??

AP Government Cleared

AP Government Cleared : తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర రిలీజ్ కి సిద్ధం అవుతున్న మరో బిగ్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట”. కొన్ని రోజులు కితమే వచ్చిన భారీ ప్రాజెక్ట్ ఆచార్య ప్లాప్ కావడంతో ఇప్పుడు చిత్ర పరిశ్రమ అంతా మహేష్ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇలా మంచి అంచనాలని ఏర్పర్చుకున్న ఈ చిత్రం ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొల్పుకుంది.

అయితే ఈ సినిమాకి గాను మేకర్స్ దాదాపు ఎలాంటి టికెట్ ధరల హైక్స్ తీసుకోకుండా రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది. అయితే దీనికి చిన్న సవరణలా కొద్ది పాటి ధరలు పెంచుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీలో ధరలు విషయానికి వస్తే కేవలం కొన్ని థియేటర్స్ లో మాత్రమే ధర పెంచుతున్నారట.

అది కూడా అదనంగా ఒక 30 నుంచి 50 లోపే ఉంటుంది అని సినీ వర్గాల్లో టాక్. దీనితో ఏపీ ప్రభుత్వం నుంచి ఈ సినిమాకి అన్ని సహకారాలు అందిస్తున్నట్టే ఉందని ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ సరసన మొదటి సరి హీరోయిన్ గా నటించగా దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. అలాగే ఆల్రెడీ ట్రైలర్ తో ఏపీ సీఎం జగన్ డైలాగ్ తో అటు ప్రభుత్వం నుంచి కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నారు. ఇలా కూడా వీరికి ఎలాంటి ఢోకా లేదని చెప్పాలి.