Suicide: భర్త హింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గర్భిణీ..!

Suicide: ప్రస్తుత కాలంలో చాలా మంది మద్యానికి బానిస అవుతున్నారు. ఈ మద్యం కారణంగా చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యం కారణంగా కుటుంబ కలహాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి విషాదకర సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. బట్టలు పెట్టే హింస భరించలేక చాలామంది పుట్టింటికి వెళ్ళిపోతే, కానీ కానీ కొందరు మాత్రం ఆ బాధ భరించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది.

రామనగరకు చెందిన జాహ్నవి,పాండవపుర తాలూకా బల్లేనహళ్లి గ్రామానికి చెందిన కర్ణతో 9 నెలల క్రితం వివాహం జరిగింది. ప్రతి అమ్మాయి పెళ్లి అయిన తర్వాత ఎన్నోకలలతో, ఆశలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. జాహ్నవి కూడా పెళ్లి తర్వాత తన జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుని ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది. కానీ తన భర్తకు ఉన్న మద్యం అలవాటు వల్ల తన ఆశలన్ని ఆవిరైపోయాయి. కర్ణ నిత్యం మద్యం తాగుతూ తన భార్యను హింసించేవాడు.

ప్రస్తుతం జాహ్నవి 5 నెలల గర్భిణీ. భార్య కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ప్రతి రోజూ తాగి వచ్చి ఆమెకు నరకం చూపించేవాడు. భర్త పెట్టే హింసలు భరించలేక జాహ్నవి నెల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్ళినా కూడా ఆమెకు అక్కడ మనశ్శాంతి లేకుండా తన భర్త ప్రతి రోజు ఫోన్ చేసి మాటలతో చిత్రవధ చేసేవాడు. తన భర్త మాటలకు విసిగిపోయిన జాహ్నవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మ హత్య కు పాల్పడింది. జాహ్నవి తల్లిదండ్రులు తన కుమార్తె మరణానికి తమ అల్లుడే కారణమని ఐజూరు పోలీసులకు తమ అల్లుడిపై ఫిర్యాదు చేశారు. మద్యం అలవాటు కారణంగా 5 నెలల గర్భిణీ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటివి ప్రతి రోజు ఎన్నో జరుగుతూ ఉంటాయి.