Health Tips: ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వాడకం అధికమయింది. ఇంట్లో గృహోపకరణాల నుండి అన్ని అన్ని పదార్థాలు నిల్వ చేయడానికి కూడా ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నారు. అయితే ఈ వేసవి కాలంలో ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్ లో నింపిన కూల్డ్రింక్స్ మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. గోల్డ్ రింగ్స్ కాగిన తరువాత ప్లాస్టిక్ వాటిని పడేయకుండా వాటిని శుభ్రంగా కడిగి ఇంట్లో నీళ్ళు నింపి ఫ్రిజ్లో ఉంచి ఆ నీటిని తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎలా ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని దెబ్బతీయడమే కాకుండా అందులో ఉండే రసాయనాలు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనల్లో వెల్లడయింది. ప్లాస్టిక్ బాటిల్ లో నీరు నీరు తాగటం వల్ల అందులో ఉండే థాలేట్స్ అనే రసాయనాలు లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో ఎక్కువసేపు నీటిని నిల్వ ఉంచడం వల్లఅందులో బ్యాక్టీరియా ఏర్పడి.. ఫ్లోరైడ్, ఆర్సెనిక్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ మూలకాలు శరీరంలో విషం లా పనిచేస్తాయి. ఎక్కువ కాలం ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు నిల్వ ఉంచడం వల్ల అందులో బీపీఏ (బిఫినైల్ ఏ) అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనం శరీరంలో జీర్ణ క్రియను దెబ్బతీసి జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ రసాయనాల వల్ల డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి.
