Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పహాల్గం పై ఉగ్రవాది దాడి ఘటన గురించి స్పందించారు. నేడు ఈ దాడిలో మరణించినటువంటి వారికి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నివాళులు అర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు. పహల్గాం పర్యటనకు వెళ్ళినటువంటి పర్యాటకులను వేటాడి మరి హిందూ నా ముస్లిమా అని అడుగుతూ వారిని కాల్చి చంపారు. ఇలా 27 మంది వరకు పర్యాటకులు మరణిస్తే కాంగ్రెస్ కి మాత్రం బాధ లేదని పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని తెలిపారు.
ఇలా భారత్ లో ఉంటూ పాకిస్తానీ పై ప్రేమ చూపించే కాంగ్రెస్ నాయకులు ఇండియాలో ఉండొద్దని పాకిస్తాన్ కి వెళ్లిపోండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని పవన్ తెలిపారు.
కాశ్మీర్ మన దేశం కావడంతో ఎంతో మంది పర్యాటకులు అక్కడ ప్రకృతి అందాలను చూడటం కోసం వెళ్లారు.నేను చాలా సార్లు ముస్లిం సమాజానికి చెప్పా. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి?. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండాలని పవన్ తెలిపారు. ఇలా ఈ ఉగ్రదాడి గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.