Health Tips: సాధారణంగా మన భారతదేశంలో చాలా రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలో పండ్లను ఖచ్చితంగా చేర్చుకోవాలి. మనకి మార్కెట్లో చౌకగా దొరికే పండ్లలో రేగి పండ్లు కూడా ఒకటి. రేగు పండ్ల రుచి పుల్లగా తియ్యగా ఉండటంతో అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. రేగి పండ్లు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం తినే రేగి పండ్లు ఎన్నో రోగాలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా వాటి ఆకుల వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రేగి పండ్లు ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రేగి పండ్లలో మాదిరిగా రేగి పండు ఆకు లలో కూడా మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు దాగివున్నాయి. రేగు పండ్ల ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారికి రేగిపళ్ల ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. అధిక బరువు ఉన్నవారు రేగిపండ్లు ఆకులను ఎలా ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని రేగిపళ్ల ఆకులను శుభ్రంగా కడిగి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక గ్లాసుడు నీటిలో ఈ ఆకులను వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయం లేవగానే పరగడుపునే ప్రతిరోజు ఆ నీటిని తాగటం వల్ల అధిక బరువు సమస్య తగ్గుముఖం పడుతుంది.
రేగిపళ్ల ఆకులను , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసు నీటిని పోసి పదినిమిషాలు బాగా ఉడికించాలి. ఆ నీరు కొంచెం చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి ఆ నీటిని తాగడం వల్ల దగ్గు జలుబు జ్వరం గొంతునొప్పి వంటి సీజనల్ వ్యాధులు కూడా నయమవుతాయి. ఇలా ఉడికించిన నీటిని తాగటం వల్ల మూత్రాశయంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మూత్రాశయంలో మంట కలగటం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి
