భారీ లెవెల్ బిజినెస్ జరుపుకున్న “భీమ్లా నాయక్”..!

పవర్ స్టార్ పవన్ కల్యాన్ మరియు రానా లు హీరోలు గా నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్న భారీ సినిమా “భీమ్లా నాయక్”. మాస్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12నే రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత నాగ వంశీ నిన్ననే కన్ఫర్మ్ చేశారు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు భీమ్లా నాయక్ బిజినెస్ వివరం వినిపిస్తోంది. ఈ సినిమా కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే భారీ లెవెల్లో 95 కోట్లు జరిగిందట. ఇక మిగతా డిజిటల్, డబ్బింగ్, శాటిలైట్ హక్కులు కలిపితే ఎలా లేదన్నా 150 కోట్లు దగ్గరకి వచ్చేసి ఉంటుంది. మొత్తానికి మాత్రం పవర్ స్టార్ పవర్ కి తగ్గ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. ఇక ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.