Bandla Ganesh : విజయ్ సాయి రెడ్డిని కెలికిన బండ్ల గణేష్

Bandla Ganesh : బండ్ల గణేష్ మళ్లీ వివాదాల్లోకెక్కారు. ఈసారి వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డిని కెలికాడు. కమ్మ సామాజిక వర్గంపై విజయ్ సాయి రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారనేది బండ్ల గణేష్ ఆరోపణ. సోషల్ మీడియాలో ట్వీట్ల పరంపర కొనసాగించాడు.

బండ్ల గణేష్ అంటే కేవలం సినీ నటుడు, నిర్మాత మాత్రమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి భక్తుడు కూడా.

ఆయనకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయ్. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బండ్ల గణేష్‌కి అత్యంత సన్నిహితుడు.

తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడిననీ, అయితే, టీడీపీతో రాజకీయంగా సంబంధాల్లేవనీ చెప్పాడు బండ్ల గణేష్. కమ్మ సామాజిక వర్గంపై విజయ సాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదన్నాడు.

చంద్రబాబు మీద కోపం వుంటే, ఆయన్ని తీట్టుకొవచ్చనీ, చంద్రబాబు మీద వంకతో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదనీ బండ్ల హెచ్చరించాడు.

వైఎస్ జగన్, షర్మిల మధ్య గొడవలకి విజయ సాయిరెడ్డి కారణమనీ, అన్నా చెల్లెలి మధ్య తగవులు పెట్టిన విజయ సాయి రెడ్డి మోసాన్ని వైఎస్ జగన్ గుర్తించాలనీ ట్వీటేశాడు బండ్ల గణేష్.

బండ్ల గణేష్ ట్వీట్లతో రాజకీయంగా కలకలం రేగింది. విజయ సాయి రెడ్డి తన మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశమున్నదనీ బండ్ల గణేష్ అన్నాడు.

సాధారణంగా రాజకీయ వివాదాలకు దూరంగా వుండే బండ్ల, ఇప్పుడెందుకిలా విజయ సాయి రెడ్డిపై మండిపడ్డాడో ఎవరికీ అర్ధం కావడం లేదు.