AP: రాజకీయాలు అన్న తర్వాత ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ పై కూటమినేతలు సెటైర్లు వేయగా కూటమినేతలు కూడా వైసిపి పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కూటమినేతలు వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరికొత్త పేరును పెట్టారు.
జగన్మోహన్ రెడ్డి గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సి వచ్చిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి వచ్చిన లేదా ఒక మీమ్ వేయాలన్నా కూడా అదే పేరుతోనే పిలుస్తూ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. మరి కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డికి పెట్టిన పేరు ఏంటి అనే విషయానికి వస్తే..వైఎస్ జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు అనే కొత్త పేరుతో పిలుస్తున్నారు. ఇటీవల కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటూనే రాజకీయాలు నడుపుతున్నారని తెలుస్తోంది.
ఇక ఈయన ఏపీలో ఉండటం కంటే కూడా బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. వారంలో నాలుగు రోజులు బెంగుళూరులో ఉంటే రెండు రోజులు మాత్రమే ఏపీలో ఉంటున్నారు. దీంతో వైయస్ జగన్ వర్క్ ఫ్రం బెంగళూరు అంటూ సరికొత్త పేరుతో కూటమినేతలు విమర్శలు చేస్తున్నారు. సోమవారం బెంగళూరు నుంచి జగన్ విజయవాడకు వస్తున్నారు. ఇక గురువారం సాయంత్రం తిరిగి బెంగళూరు వెళ్ళిపోతున్నారు.
ఇలాంటి తరుణంలోనే ఈయన రాజకీయాలకు సంబంధించిన కొన్ని కార్యకలాపాలను కూడా బెంగళూరు పాలస్ నుంచి కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ పేరుతో కూటమినేతలు జగన్మోహన్ రెడ్డిని పిలవడమే కాకుండా విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా హైదరాబాదులోనే ఉండేవారు. అయితే అప్పట్లో హైదరాబాద్ కి పరిమితమయ్యారు అంటూ వైసీపీ నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను విమర్శించారు ఇక ఇప్పుడు కూటమి నేతలు వంతు రావడంతో వీళ్ళు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిని వర్క్ ఫ్రం బెంగళూరు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.