హైకోర్టు సీరియస్ గా ఒకే ఒక్క ప్రశ్న అడిగింది .. ఖంగుతిన్న ప్రభుత్వ న్యాయవాది !

AP Failed In Regulation of Corona Virus

ఆంధ్ర లో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఘర్షణ వైఖరి

ఏపీ రాజకీయాలు మొత్తం రాజధాని చుట్టే తిరుగుటున్నాయి. అభివృద్ధి కోసమే వికేంద్రకరణ అని వైసీపీ నాయకులు చెప్తుంటే, రాజధాని క్రెడిట్ టీడీపీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ, అలాగే సిఆర్డీఏ రద్దు, ఈ రెండు బిల్లులు గవర్నర్ ఆమోదించటం, అలాగే గజెట్ విడుదల కావటంతో, రాజధాని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. రైతుల వాదన విన్న హై కోర్టు రాజధానిపై స్టేటస్ కో విధించింది. ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వైసీపీ ప్రభుత్వం వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న 14 కావడంతో విచారించిన హై కోర్టు స్టేటస్ కో ఈనెల 27 వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ నిర్ణయంపై ప్రభుత్వ తరపు న్యాయవాది రాకేష్ త్రివేది తన వాదనను వినిపిస్తూ…కావాలంటే వాయిదా వెయ్యాలని, కానీ స్టేటస్ కో ఇస్తే, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేయటానికి వీలు లేకుండా పోతుందని, అందుకే స్టేటస్ కో ఎత్తేయాలని, హైకోర్టును విజ్ఞప్తి చేసారు. అయితే ఈ వాదనను పిటిషనర్ తరపు న్యాయవాది వ్యతిరేకిస్తూ…చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే స్టేటస్ కో ఆడిగామని, హై కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే ఈ వాదనలు విన్న హై కోర్టు కరోనా సమయంలో అంత అర్జెంట్ గా చేయాల్సిన పనులు ఏమున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నిస్తూ, స్టేటస్ కో ను ఈనెల 27 వరకు పొడగించారు. ఈ నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. స్టేటస్ కో పై ప్రభుత్వ తరపు న్యాయవాదికి హై కోర్టు వేసిన ప్రశ్నకు బదులు చెప్పలేకపోయారు. ఈ సంచలన నిర్ణయం వైసీపీ నేతల్లో మరింత ఆవేదనను పెంచిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.