Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతిని పున ప్రారంభించడమే కాకుండా అమరావతిలో పనులు కూడా వేగంగా జరగడానికి అని చర్యలను తీసుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు తన బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా అమరావతిలో ఈ గిఫ్ట్ ఇవ్వటం విశేషం.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే.దీంతో ప్రభుత్వం అమరావతిలో భూముల కేటాయింపులు మొదలు పెట్టింది.ఇవాళ జరిగిన సీఆర్డీఏ భేటీలో చేసిన భూకేటాయింపుల్లో సీఎం చంద్రబాబు పనిలో పనిగా తన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా ఓ గిఫ్ట్ ఇచ్చేశారు.
గతంలో జరిగిన సీఆర్డీఏ భేటీలో నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అమరావతి రాజధానిలో కొత్త బ్రాంచ్ ఏర్పాటు కోసం 15 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అయితే తాజాగా మరోసారి సిఆర్డిఏ బేటిలో భాగంగా బసవతారకం మెడికల్ హాస్పిటల్ కోసం మరో ఆరు ఎకరాలను కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ఇదే ఆస్పత్రికి ఇచ్చిన 15 ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కూడా కలిపి 21 ఎకరాలు ఇచ్చినట్లయింది.
ఇక త్వరలోనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.ఫేజ్-1లో 300 పడకలతో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించనున్నారు. భవిష్యత్తులో దీనిని వెయ్యి పడకల క్యాన్సర్ హాస్పిటల్ గా తీర్చి దిద్దుతామని వెల్లడించారు.