పవన్ కళ్యాణ్ ను విమర్శించిన వెల్లంపల్లి శ్రీనివాస్!

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సభ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా ఈ సభ పై వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు రావడంతో తాజాగా ఈ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించాడు.

అంతేకాకుండా మీడియా ముందు పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేశాడు. ఐపీఎల్ లో క్రీడాకారుల వేలంపాట జరుగుతుంది. అదేవిధంగా పవన్ కూడా సభలు పెట్టి ప్యాకేజీలు పెంచుకోవడానికి ఇలా చేస్తున్నాడని అన్నాడు. నాకు ఇంత జనం ఉన్నారని నిరూపించుకోవడానికి ఆయన ఇటువంటి సభలు ఏర్పాట్లు చేస్తున్నాడని.. ఆయన వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు అంటూ.. అటువంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారని కామెంట్లు చేశాడు.