Pawan Mahesh Jr NTR Common Success : సక్సెస్లలో ఈ కామన్ సక్సెస్ వేరయా.. అంటే అతిశయోక్తి కాదేమో. ఇంతకీ అదేంటంటే, ఓ ముగ్గురు హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగిన వైనం. ఒక్క సినిమాతో తిరుగులేని స్టార్డమ్ దక్కించుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద రారాజులుగా వెలిగిపోయారు. ఎవరా హీరోలు.? ఏంటా కామన్ పాయింట్.?
పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ చేసిన సినిమా ‘ఖుషీ‘. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 23 కోట్లు వసూళ్ల చేసి, సంచలనం సృష్టించింది. అప్పటికే పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల్లో అంతులేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కానీ, ఏడో సినిమా అయిన ‘ఖుషీ’తో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్గా నిలిచారనడం అతిశయోక్తి కాదేమో.
మహేష్ బాబుని సూపర్ స్టార్గా నిలబెట్టిన సినిమా ‘ఒక్కడు’. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో ఏడవ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 23 కోట్లు కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తిరుగులేని స్టార్డమ్ కట్టబెట్టింది మహేష్ బాబుకి ఈ సినిమా.
ఇక ముచ్చటగా మూడో హీరో యంగ్ టైగర్ ఎన్టీయార్. ఈయన కెరీర్లోనూ ఏడవ సినిమా హిస్టరీ తిరగరాసింది. అదే ‘సింహాద్రి’ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా 26 కోట్లు కొల్లగొట్టి, ఎన్టీయార్ని యంగ్ టైగర్ని చేసిన సినిమా ఇది.
అంటే ఈ ముగ్గురు హీరోలకీ ఏడో సినిమా కెరీర్ టర్న్ సినిమాగా చెప్పుకోవచ్చు. అన్నట్లు ఇక్కడ గమంనించాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ముగ్గురు హీరోల ఏడవ సినిమాల్లోనూ నటించిన హీరోయిన్ కూడా ఒక్కరే. ఆమె ఎవరో కాదు, భూమిక. వావ్.! వాట్ ఏ కో ఇన్సిడెంట్ కదా. పోలా అదిరిపోలా.!