ఈ క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశా .. మంచు లక్ష్మీ..!

మంచు ఫ్యామిలీలో హీరోలే కాదు హీరోయిన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. గుండెల్లో గోదారి లాంటి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన మంచు లక్ష్మీ సిద్దార్థ్ – శృతి హాసన్ నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దొంగల ముఠా, ఊ..కొడతారా ఉలిక్కిపడతారా, w/o రామ్‌, మా వింత గాధ వినుమా, లాంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కడలి.. అలాగే హిందీలో డిపార్ట్‍మెంట్ లాంటి మల్టీ స్టారర్ లో కూడా నటించింది. ఇక తెలుగులో నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాకి నంది పురస్కారము అందుకుంది. అలాగే ప్రయోగాత్మక చిత్రం చందమామ కథలు సినిమాకి ఉత్తమ సహాయ నటిగా తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ ని అందుకుంది.

Image

అంతేకాదు బుల్లితెర మీద ప్రేమతో మీ లక్ష్మీ అన్న సెలబ్రిటీ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ ప్రోగ్రాం ద్వార పలువురు సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూస్ చేసింది. అలాగే మేము సైతం అన్న ప్రోగ్రాం ద్వారా ఎందరో పేదలను ఆదుకుంది. పలు టెలివిజన్ షోస్ మాత్రమే కాదు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసింది మంచు లక్ష్మీ.

కాగా తాజాగా మంచు తన ముద్దుల కూతురితో కలిసి కొత్త ఆఫీస్ లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన కూతురితో ఇలా కొత్త ఆఫీస్ లో అడుగుపెడుతుండతం తో చాలా సంతోషంగా ఉందని .. ఈ క్షణాలు ఎంతో మధురమైనవని .. ఇందుకోసం కొన్నాళ్ళుగా ఎంతో ఎగ్జైటింగా ఎదురు చూశానని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక మంచు లక్ష్మీ తన కూతురు తో కలిసి ఉన్న ఫొటోని అభిమానుల తో షేర్ చేసుకోగా ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.