Bangladesh: ఢాకాలో జరిగిన ఎమర్జింగ్ టూర్నమెంట్లో బంగ్లాదేశ్ vs దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఊహించని వివాదానికి వేదికైంది. ఫ్రెండ్లా కనిపించాల్సిన క్రీడాభిమానుల ముందే క్రికెట్ మైదానంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య ముష్టి పోరు చోటుచేసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లా బ్యాటర్ రిపన్ మోండల్కు, సఫారీ ఫాస్ట్ బౌలర్ షిపో నులికి మధ్య జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఈ వివాదానికి కారణం మాత్రం రిపన్ బ్యాటింగ్లో చూపిన దూకుడేనని తెలుస్తోంది. షిపో నులి వేసిన ఓ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన రిపన్ మోండల్ పై బౌలర్ అసహనంగా స్పందించాడు. రెండో సిక్సర్ అనంతరం ఇద్దరు ఒకరినొకరు చూస్తూ మాటల యుద్ధం ప్రారంభించారు. అప్పటికి తలుపులు మూసుకుపోయినట్టు అనిపించినా, నులి బౌలింగ్ ముగిశాక రిపన్ నాన్ స్ట్రైకర్ ఎండ్కి వెళ్లే క్రమంలో అతడిపై ఒక్కసారిగా దూసుకెళ్లాడు.
ఘర్షణ దాటికి చేరడంతో నులి, రిపన్ను తోసి వేయగా, రిపన్ తన బ్యాట్తో ఎదురుదాడికి దిగాడు. ఇది కాస్త శారీరక దాడి వరకు వెళ్లింది. హెల్మెట్ లాగేయడం, చేతులతో తోసుకోవడం లాంటి దృశ్యాలన్నీ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తక్షణమే అంపైర్లు, ఆటగాళ్లు మధ్యలోకి వచ్చి పరిస్థితిని శాంతింపజేశారు. కానీ మైదానంలో ఈ స్థాయికి ఇద్దరు ఆటగాళ్లు దిగిపోవడం అరుదైన ఘటన.
ఇప్పటివరకు ఈ సంఘటనపై అధికారికంగా ఎలాంటి కఠిన చర్యలు ప్రకటించలేదు. అయితే మ్యాచ్ రిఫరీ నివేదికల ఆధారంగా BCB, CSAలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. క్రికెట్ను గౌరవించేలా ప్రవర్తించాల్సిన ఆటగాళ్లు ఇలా వ్యవహరించడంతో వీరిపై సస్పెన్షన్ లేదా జరిమానాలు విధించే అవకాశముంది. మైదానంలో ఆట పటిమకంటే ఆగ్రహం చూపితే ఎలా ఉంటుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
I have never seen such an incident in the history of cricket. A direct fight. What a shameful incident of cricket happened between the talented bowler Shepo Ntuli of South Africa and Ripon Mondal of Bangladesh. This is extreme. #BANevsSAe #CricketTwitter #Bangladesh #SouthAfrica pic.twitter.com/3CbMTHwUEA
— Monirul Ibna Rabjal 🇧🇩🇪🇺 (@to2monirul) May 28, 2025