పెరుగు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అలా పెరుగు తింటే మాత్రం ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. ఇతర కాలాలతో పోల్చి చూస్తే వేసవిలో పెరుగు వినియోగం ఎక్కువనే సంగతి తెలిసిందే. పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రీజన్ వల్లే ఎక్కువమంది పెరుగు తినడానికి ఇష్టపడతారు. అయితే పెరుగు తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. తరచూ పెరుగు తినేవాళ్లు ఎక్కువ మొత్తంలో పెరుగు తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంది.

పెరుగు ఎక్కువగా తీసుకుంటే దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, ఉబ్బసం బారిన పడే అవకాశం ఉంటుంది. మోకాళ్ల సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు పెరుగుకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. పెరుగు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పెరుగు ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

పెరుగు ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కడుపు ఉబ్బరంతో బాధ పడేవాళ్లు పెరుగు తినే విషయంలో మరిన్ని జాగ్రత్తలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అయితే పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. రోజుకు ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పెరుగు తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పెరుగులో శరీరానికి అవసరమైన ప్రోటీన్, లాక్టోస్ తో పాటు కాల్షియం, భాస్వరం కూడా ఉంటాయి. పెరుగులో బెల్లం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.