వైఎస్సార్‌ మరణంపై బీజేపీ ఎమ్మెల్యే రివర్స్‌ గేర్‌.. సీక్రెట్‌ ఇదేనా.?

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత రఘునందన్‌కి నోటి దురుసు కాస్త ఎక్కువే. ఒకప్పుడు కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన రఘునందన్‌, అనూహ్య పరిణామాల నడుమ టీఆర్‌ఎస్‌ని వీడారు. ఆ తర్వాత రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు ఆయన నానా పాట్లూ పడ్డారు. ప్రముఖ న్యాయవాది కూడా అయిన రఘునందన్‌, ఎలాగైతేనేం, ఎమ్మెల్యేగా గెలిచి తన కల నెరవేర్చుకున్నారు. ఆ ఆనందంలోనే వైఎస్సార్‌ మరణంపై అత్యుత్సాహపూరిత స్టేట్‌మెంట్లు ఇచ్చేసి వివాదాల్లోకెక్కారు.

bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana
bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana

పావురాల గుట్టలో పావురం.. ఇదెక్కడి రాజకీయం.?

పోయినోళ్ళంతా మంచోళ్ళేనన్నది పెద్దల నానుడి. కానీ, రాజకీయాల్లో అలా కుదరదు. అయినాగానీ, ఎన్నికల వేళ ఎవరి సెంటిమెంట్లు దెబ్బతిన్నా సీన్‌ మారిపోతుంది. రఘునందన్‌ అత్యుత్సాహం బీజేపీకి ఇరకాటంగా మారింది. వైఎస్సార్‌ మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి గురయ్యారు రఘునందన్‌. బీజేపీ అధిష్టానం, జరిగిన డ్యామేజీని గుర్తించింది.. జరగబోయే డ్యామేజీ గురించి తెలుసుకున్నట్టుంది.. దాంతో, రఘునందన్‌ క్షమాపణ చెప్పక తప్పలేదు.

bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana
bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana

గ్రేటర్‌ ఎన్నికల్లో వైసీపీ ఓటు.. అటూ ఇటూ.!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలకు సంబంధించి నిన్న మొన్నటిదాకా వైసీపీ ఓటు కొంత టీఆర్‌ఎస్‌కీ, ఇంకొంత బీజేపీకీ అన్నట్టుగా వుంది. ఎప్పుడైతే రఘునందన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు వైఎస్సార్‌ మీద చేశారో, సీన్‌ మారిపోయింది. పూర్తిగా వైసీపీ ఓటు బ్యాంకు టీఆర్‌ఎస్‌ వైపుకు మళ్ళింది. కానీ, ఇప్పుడు బీజేపీ అధిష్టానం చొరవతో, రఘునందన్‌ క్షమాపణ చెప్పారుగనుక.. వివాదం చల్లారినట్లేనన్న భావన కమలనాథుల్లో కనిపిస్తోంది.

bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana
bjp,ysrcp,andhra pradesh,politics,kcr,trs,telangana

రఘునందన్‌కి పెద్ద డ్యామేజీనే జరిగిందట

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచాక రఘునందన్‌కి బీజేపీలో మరింత ప్రత్యేక గుర్తింపు దక్కిన మాట వాస్తవం. కానీ, ఒకే ఒక్క మాటతో రఘునందన్‌ తన స్థాయిని తగ్గించేసుకున్నట్లయ్యింది. ఈ ఎఫెక్ట్‌ ఆయన తదుపరి రాజకీయ భవిష్యత్తుపైనా పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.