లక్ష్మీ కటాక్షం కలగాలంటే నువ్వులు బెల్లంతో ఇలా చేస్తే చాలు… సంపద మీ వెంటే!

ప్రతి ఒక్కరు తమ జీవితంలో సంతోషంగా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటారు. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తూ,మన వంతు కష్టాన్ని మనం చేస్తూ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని పూజిస్తారు. అయితే ఎంత కష్టపడినా కొందరికి మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు. తరచూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. అయితే దానం ధర్మం అనేది లేని వారికి మాత్రమే చేయాలి అలాగే బ్రాహ్మణులకు కూడా చేయటం వల్ల పుణ్యఫలం కలుగుతుందని భావిస్తారు. అలా కాకుండా మనకు ఇష్టమైన వారికి వారికి నచ్చిన వస్తువులను దానం చేయటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.అందుకే పేదవారికి దానం చేయాలి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల అన్ని శుభ పరిణామాలు కలుగుతాయి.

ఈ క్రమంలోనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు మన పైనే ఉంటాయని చెప్పాలి. బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం శుక్రవారం దానం చేయటం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మన పైనే ఉంటాయి. ఇకపోతే బ్రాహ్మణులకు దానం చేయలేనటువంటి వారు నువ్వులు బెల్లం శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టి అనంతరం నువ్వులు బెల్లం ఆవుకు తినిపించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.