ఐదో రోజు స్కందమాతగా దుర్గమ్మ !

దేవి శరన్నవరాత్రులల్లో భాగంగా అక్టోబర్ 21న బుధవారం ఐదోరోజు దుర్గాదేవి స్కందమాతగా దర్శనిమిస్తారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ శక్తి స్వరూపిణి. ఆ దేవత అమ్మగా కనిపించే అద్భుతమైన రూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. ఆయనకు తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. ఈ రూపంలో శ్వేతవర్ణంలో కుమారస్వామిని లాలిస్తూ దర్శనమిస్తుంది. ప్రతీ రూపంలో అంటే వస్తువు, మనిషి అందరిలోనూ మాతృమూర్తీ జగన్మాతను దర్శించాలనే సందేశాన్ని మానవాళికి ప్రబోధిస్తుంది ఈ అవతారం.

5th day of durga devi navaratrulu
5th day of durga devi navaratrulu

ప్రార్థన శ్లోకాలు
అక్టోబర్ 21, ఆశ్వీయుజ శుద్ధ పంచమి రోజు స్కందమాతగా జగజ్జననిని పూజించి, లలితా సహస్రనామ పారాయణంతో స్తుతించాలి అదేవిధంగా కింది శ్లోకాన్ని పఠించాలి.
“సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥”
నైవేద్యం:
దధ్యోదనం (పెరుగన్నం) నివేదనగా సమర్పిస్తారు.
– అమ్మవారిని పై విధంగా అర్చించిన సంతాన యోగం, సంతాన వృద్ధి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.