క్యాన్సర్ రావడానికి కారణమేంటో తెలుసా

ప్రతి ఒక్కరిని భయపెడుతున్న వ్యాధి క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందో, దానికి కారణమేందో కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ క్యాన్సర్ ను పెద్ద  మహమ్మారిగా చూపి కార్పొరేట్ హాస్పిటల్స్ పొమ్ము చేసుకుంటున్నాయి. అయితే ఈ క్యాన్సర్ గల కారణాలు, నివారణ చర్యలు తెలిస్తే మీరు షాకవుతారు.

రెండో ప్రపంచ యుద్దం తర్వాత కాలం నుంచి క్యాన్సర్ రోగుల సంఖ్య అధికమయ్యింది. అసలు చాలా మందికి క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. అయితే క్యాన్సర్ శరీరంలోని ఏదో ఒక కణం నుంచి పుట్టి వ్యాప్తి చెందుతుంది. అది శరీరంలోని ఏ భాగంలోనైనా పుట్టవచ్చు.  శరీరం ఎన్నో కణాల సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరము. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది. శరీరానికి అవసరం లేక పోయినా కొత్త కణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కంతి లాగా గడ్డలాగా తయారవుతుంది. ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అంటారు. 

క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం

గిన్నెలను వాష్ చేయడానికి రసాయనాలు కలిగిన సబ్బులను ఉపయోగిస్తాం. వాటిని కడిగేటప్పుడు కొన్ని కెమికల్స్ అలానే ఉంటాయి. అదే ప్లేట్లలో తినడంతో ఆ కెమికల్స్ కడుపులోకి పోయి కణాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ కణాలలోని లోపంతోనే క్యాన్సర్ సోకే ప్రభావం ఉంది. క్యాన్సర్ శరీరంలోని ఏ కణానికైనా వచ్చే అవకాశం ఉంది. బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, లివర్ క్యాన్సర్, మెదడులో గడ్డల వలన కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అధికంగా వస్తుంది. నిత్యం పరిశుభ్రంగా ఉండడంతో క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అధిక బరువు కూడా క్యాన్సర్ కి కారణమే. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం B 17 విటమిన్ లోపం. ఈ విటమిన్ దొరికే పదార్దాలు తింటే క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

క్యాన్సర్ రాకుండా B 17  విటమిన్ దొరికే పదార్దాలు

అల్లనేరేడు కాయలు, సేపులు, క్రాన్ బెర్రి, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, నువ్వులు, బియ్యం, గోధుమలు, ఓట్స్, పీచు పదార్ధములు, నిమ్మకాయ, ఉసిరి కాయ, చిక్కుడు కాయ లలో అధిక శాతం బి 17 విటమిన్ దొరుకుతుంది. వీటిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకొని క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.  

చాలా మంది డాక్టర్లు క్యాన్సర్ కు నివారణే మార్గమని చెబుతున్నారు కానీ దానిని ఏ విధంగా నివారించవచ్చో చెప్పకుండా రోగులను సొమ్ము చేసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.