దారుణం: కొడుకు కొట్టిన చెంపదెబ్బ.. తల్లి మృతి..! మనసుల్ని తొలిచేస్తున్న వీడియో

చిన్నప్పుడు తల్లి మాటే వేదంగా భావిస్తాడు కొడుకు. తల్లి మాట దాటడు. కానీ.. పెళ్లయ్యాక తల్లిని దూరం చేసిన వారు.. వృద్ధాశ్రమంలో చేర్పించిన వారూ ఉన్నారు. అయితే.. తల్లిని కొట్టి చంపిన కొడుకు గురించి ఎక్కడా వినడం.. చూడటం జరిగి ఉండదు. ఓ ప్రభుద్ధుడు ఆ పని చేసి చూపించాడు. తల్లీ–కొడుకుల బంధానికే మచ్చ తెచ్చాడు. తల్లిని చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టాడు. ఆ తల్లికి కొడుకు కొట్టిన దెబ్బ కంటే.. ఆ బాధే గుండెలకు గట్టిగా తగిలినట్టుంది.. ఆ చెంపదెబ్బకు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరిగిందీ ఘటన. 76 ఏళ్ల అవ్‌తార్‌ కౌర్‌.. 45 ఏళ్ల కుమారుడు రణ్‌వీర్, కోడలితోసహా స్థానికంగా నివాసం ఉంటోంది. మార్చి 15న సోమవారం మధ్యాహ్నం ఓ సమస్యపై ఇంట్లో వాగ్వాదం జరిగింది. పక్కింటి వారితో పార్కింగ్‌ స్థలం విషయమై అవతార్ కౌర్ కొడుకుతో మాట్లాడుతూండగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. వారిక మధ్యలో కోడలు ఉండి సర్ధిచెప్తోంది. అయితే ఆ వాగ్వాదంలో కోపంతో రణ్‌వీర్‌ తల్లిని చెంపపై చాలా బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అవతార్ కౌర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ వృద్ధురాలిని కోడలు పైకి లేపేందుకు ప్రయత్నించింది. కానీ.. అవతార్ కౌర్ మళ్లీ లేవలేదు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రణవీర్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అయితే.. ఈమధ్య తల్లీ, కొడుకుల మధ్య ఆస్తి విషయంలో కొంత కాలంగా ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెపై ఉన్న కోపం కూడా ఆమెను కొట్టేందుకు కారణమైందని అంటున్నారు. అయితే.. ఎంత ఆస్తి గొడవలైనా తల్లిని కొడుకు కొట్టడం మాత్రం దారుణమైన విషయం.

https://twitter.com/PunYaab/status/1371903917815042048?s=20