ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్ట అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళపై.. ఆయన భార్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘చంద్రబాబు దత్త పుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అన్నట్టుగా కాదు..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించీ, పవన్ కళ్యాణ్ భార్యల గురించీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేయడం ఇదే కొత్త కాదు.
వీలు చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ ప్రస్తావ వైఎస్ జగన్ ఏదో ఒక రకంగా తీసుకొస్తుంటారు. తాజాగా, వైఎస్ జగన్ ఇంకోసారి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకురావడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
సాధారణ రాజకీయ నాయకుడేమీ కాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఇతరుల పెళ్ళిళ్ళ గురించీ, భార్యల గురించీ.. అధికారిక కార్యక్రమాల్లో మాట్లాడటమేంటి.? స్క్రిప్టు చూసే ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతుంటారు. అంటే, ఇక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారన్నమాట.
పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు జరిగాయి. అదేమీ రహస్యం కాదు. చట్టబద్ధంగా మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్ళి చేసుకున్నారు. ఆ వివాహ బంధమూ ఎక్కువకాలం నిలబడలేదు. మూడో పెళ్ళి చేసుకున్నారు. చట్టబద్ధంగా తప్పు పట్టడానికేముంది ఇందులో.?
అయినా, పవన్ కళ్యాణ్ మీద ఈ తరహా విమర్శలు చేయడం వల్ల వైసీపీకి వచ్చే రాజకీయ లబ్ది ఏంటన్నది ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.
