జగన్ మాట ఇస్తే చేస్తాడంతే… ఆదినారాయణమ్మ అనుభవం ఇది!

మాట తప్పం – మడమ తిప్పం, మాట ఇచ్చాడంటే చేస్తాడంతే… ఇలాంటి స్లోగన్స్ రాయించుకోవడం చాలా సులువే కానీ… వాటికి తగ్గట్లు బ్రతకడం, వాటిని న్యాయం చేయడం చిన్న విషయం కాదు. కానీ… మాట తప్పం – మడమ తిప్పం అని గతంలో స్వరీయ వైఎస్సార్ కు పేరుండేది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత… మాట ఇచ్చాడా చేస్తాడంతే… అనే మాట తెరపైకి వచ్చింది. ఇది స్వయంగా అనుభవించానంటూ తన స్వీయానుభవం చెబుతున్నారు ఆదినారాయణమ్మ.

రాజకీయ నాయకుడంటే… కేవలం రాజకీయాలు చేసేవాడు మాత్రమే కాదు… ప్రజలను నిత్యం పట్టించుకుంటూ, ప్రజాసమస్యలపై దృష్టి పెడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలించడం. ఈ నేపథ్యంలో… పుట్టెడు కష్టాలతో తన వద్దకు వచ్చిన ఒక దివ్యాంగురాలి విషయంలో సీఎం జగన్ వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వివరాళ్లోకి వెళ్తే… ఇటీవల “నార్పల”కు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ను… అనంతపురం జిల్లా యల్లనూరు మండలం దంతెల పల్లికి చెందిన దివ్యాంగురాలు ఆదినారాయణమ్మ కలిశారు. ఈ సందర్భంగా ఆమె గురించి తెలుసుకున్న జగన్.. “మీరు కలెక్టర్ ను కలవండమ్మా.. నేను చెబుతాను” అని చెప్పారు.

దీంతో జగన్ మాటపై నమ్మకంతో తాజాగా కలెక్టరేట్ కు వెళ్లారు ఆదినారాయణమ్మ. ఆమె వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ గౌతమి.. స్వయంగా తానే ఛాంబర్ నుంచి బయటకు వచ్చారు. ఆదినారాయణమ్మను కలిశారు. ఆమె సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. “అమ్మా.. సీఎం గారే స్వయంగా నన్ను పిలిచి మీ గురించి చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తాం. ధైర్యంగా ఉండండి” అని స్వయంగా కలెక్టరే చెప్పటంతో ఆమె ఎంతో ఆనందానికి లోనయ్యారు.

బహిరంగ సభల్లోనూ, ఎన్నికల మ్యానిపెస్టోల్లోనూ ఇచ్చిన మాటలే నిలబెట్టుకోలేని రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో… ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా తనకు ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకొని కలెక్టర్ కు ప్రత్యేకంగా చెప్పిన జగన్ వైనం పై ఆదినారాయణమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఆనంద బాష్పాలతో జగన్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.