వాలంటీర్లపై జనసేనాని పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లోనూ, కార్యకర్తల మీటింగుల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ పలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సంధించిన ఒక ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చిందని అంటున్నారు నెటిజన్లు.
తాజాగా వాలంటీర్ల బాస్ ఎవరు? ప్రైవేట్ డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలిస్తున్నారు? అంటూ రకరాకాల ప్రశ్నలు సంధించారు పవన్ కల్యాణ్. ఇదే సమయంలో వాలంటీర్లపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమయంలో పవన్ ప్రశ్నలకు సమాధానం రావడంతోపాటు.. ఆయనకున్న మరో డ్యూటీ అంశం కూడా తరపైకి వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును… వాలంటీర్లకు బాస్ ఎవరో పవన్ కి సమాధానం వచ్చేసిందని తెలుస్తుంది. తిరుపతి జిల్లా వెంకటగిరి సభలో సీఎం జగన్ చేసిన ప్రసంగంతో పవన్ కు స్పష్టత వచ్చేసి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. పైగా క్యారెక్టర్ లేని వాళ్లు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి అవాకులూ చెవాకులూ పేలుతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా జగన్ మరో కీలక వాఖ్య చేశారు. ఇందులో భాగంగా.. పదేళ్లుగా చంద్రబాబునాయుడికి దత్త పుత్రుడు వాలంటీర్ గా సేవలందిస్తున్నారని దెప్పి పొడిచారు. దీంతో వాలంటీర్లపై పవన్ చేస్తోన్న విమర్శలకు కౌంటర్ గా జగన్ రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారని అంటున్నారు. పైగా… తనకు, ఏపీ ప్రజలకు లక్షల మంది వాలంటీర్లు ఉంటే… చంద్రబాబు కు మాత్రం పవన్ వాలంటీర్ గా ఉన్నారని ఎద్దేవా చేసినట్లయ్యిందని అంటున్నారు.
ఇలా జగన్ సెటైర్ తో ఏపీలోని పేదలకు సేవలందిస్తున్న వాలంటీర్ల బాస్ ఎవరూ చెప్పకనే చెప్పినట్టైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో బాబుకు రాజకీయ సేవలందిస్తున్న వాలంటీర్ మాత్రం దత్త పుత్రుడే అని వేలాది మంది సాక్షిగా జగన్ స్పష్టం చేసినట్లయ్యిందని అంటున్నారు.
దీంతో వాలంటీర్లకు బాస్ ఎవరు అనే ప్రశ్నకు జగన్ రెండు సమాధానాలు ఇచ్చినట్లయ్యిందని అంటున్నారు. ఇందులో భాగంగా… ఏపీలో ప్రజలకు బాస్ జగన్ అయితే… టీడీపీ వాలంటీర్ పవన్ కు బాస్ చంద్రబాబు అని సీఎం సెటర్స్ వేశారని అంటున్నారు నెటిజన్లు.
కాగా… తాజాగా వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులపై వరుసపెట్టి జగన్ చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి. కౌంటర్ ఇవ్వలేని స్థాయిలో జగన్ విమర్శించారని అంటున్నారు.