ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిపిన పోలవరం పర్యటనలో రెండో ప్రమాదంజరిగింది.పోలవరం పర్యటన పూర్త చేసుకుని తిరగివస్తున్నపుడు మంత్రి పుల్లారావు కాన్వాయ్లో ని కారు బోల్తా పడింది. ఇందులో పలువురు టిడిపి నేతలున్నారు. కారు కొండ వైపు పొర్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ప్రమాదంలో టిడిపినాయకులు స్వల్గంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదసమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి పుల్లారావుకు ఫోన్ చేసి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఇది రెండో ప్రమాదం.

పొద్దున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మల్సీలతను తీసుకుని పోలవరం వెళ్తున్న బస్సు దెందులూరు సమీపోం బురదలో దిగబడిపోయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వేరే వాహనాల్లో చంద్రబాబున పోలవరం స్పిల్ వే వాక్ కార్యక్రమానికి తలరించాల్సి వచ్చింది. గత రాత్రి వర్షం కురవడంతో ఈ రహదారి బురదమయం అయిందని, ఫలితంగా కారు టైర్లు గ్రిప్ కోల్పోవడంతో కారు పల్టీ కొట్టిందని పోలీసులు చెప్పారు. స్పిల్ వే పనులు చకచక సాగుతూ ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటంబ సమేతంగా పోలవరం ప్రాజక్టు ను సందర్శించిన స్పిల్ వే గ్యాలరీ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వాక్ లో పాల్గొనేందుకు మంత్రులు, శాసన సభ్యులు 8 బస్సుల్లో పోలవరం వచ్చారు.(ఫోటో సాక్షి సౌజన్యం)
