విజయవాడ జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఆసక్తికరమయిన కామెంట్స్ చేశారు. అవి:
* తెలుగుదేశం ప్రభుత్వం లో పదవులు ఇస్తారు కానీ అధికారం ఉండదు. తెలుగుదేశం ప్రభుత్వం లో మంత్రిగా ఉన్నప్పుడు అలుపెరగకుండా పనిచేశా గౌరవం దక్కలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక తెలువుదేశం నుంచి బయటకి వచ్చా.
పవన్ కళ్యాణ్ బడుగు బలహీనవర్గాల కోసం ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనా విధానాలు నచ్చి జనసేనలోకి వచ్చా. రాజకీయాలు డబ్బు మయం గా మారాయి. నవసమాజ నిర్మాణానికి నావంతు కృషి చేస్తా. చంద్రబాబు అవకాశం యిచ్చారు. అందుకురుణపడి ఉంటా. కానీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇమడలేక బైటకి వచ్చాను. అక్కడ దళితులను అణచివేస్తున్నారు.
దీనికి పవన్ కళ్యాణ్ స్పందన ఇది
రావెల కిషోర్ బాబు జనసేనలోకి రావటం మంచిపరిణామం. ఆయన సామాజిక ఉద్యమాల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకు వచ్చారు. అవకాశవాద రాజకీయాలు కాక ప్రజలకు మేలుచేసే రాజకీయాలు ఆంధ్ర ప్రదేశ్ లో రావాలి. విజయవాడ రాజకీయాలు అంటేనే కులరాజకీయలు గుర్తుకు వస్తాయి. ఆంధ్రకు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి పరిస్థితి వస్తే అభివృద్ధి కుంటుడుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో వెయ్యికోట్ల రూపాయలు అవినీతి జరిగింది. కుల రాజకీయాలకువిసిగిపోయాం నవ రాజకీయాలు రావలసిన అవసరం ఉంది. అన్నికులాలకు, అన్నివర్గాలకు జనసేన అండగా ఉంటాం. 2014లో జనసేన ఒకమెట్టుమత్రమే 2019లో అధికారంలోకి వస్తాము దళితులకు పదవులతోపాటు అధికారాన్నిస్తాం.