పవన్ కు పిఠాపురం ఫిక్స్… ఇదిగో ప్రూఫ్!

వారాహి యాత్రలో భాగంగా దూకుడూ పెంచిన జనసేన అధినేత… రాబోయే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యే అవ్వకుండా ఎవడాపుతాడో చూస్తానంటూ వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే… ఇంత కాన్ ఫిడెంట్ గా చెబుతున్నారంటే.. నియోజకవర్గం కూడా ఫిక్సయ్యే ఉంటారని అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఏదీ చివరి వరకూ చెప్పరనే విమర్శ ఉంది కాబట్టి… తాజాగా ఆయన ఇచ్చిన కొన్ని హింట్స్ ని బట్టి పిఠాపురాన్ని ఫిక్స్ చేసేస్తున్నారు ఫ్యాన్స్!

అవును… ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్ తాను పోటీచేయబోయే నియోజకవర్గం ఎక్కడనేది స్పష్టంగా చెప్పకపోయినా… అందుకు సంబందించిన లీకులు మాత్రం వదిలారని అంటున్నారు పరిశీలకులు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా యాత్రలో ఉన్న పవన్… రెండు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేశారు. ఇదే సమయంలో స్థానికంగా పిఠాపురంలో పార్టీ ఆఫీసు కూడా కడతానన్నారు.

దాందేముందిలే అనుకుందామంటే… పక్కనే ఉన్న కాకినాడలో ఒక ఆఫీసు ఉంది, ఇటుపక్క రాజమండ్రిలో మరో ఆఫీసు ఉంది. అక్కడితో ఆగని ఆయన… ఆ హింట్స్ కూడా సరిపోవనుకున్నారో ఏమోకానీ… పిఠాపురంలో తాను ఇల్లు కూడా కట్టుకుంటానని చెప్పారు! దీంతో ఒక కన్ క్లూజన్ కి వచ్చేస్తున్న పరిశీలకులు… ఆ మేరకు ప్రస్తుతానికి పిఠాపురాన్ని ఫిక్స్ చేసేసుకోవచ్చంటూ ఫ్యాన్స్ కు సూచిస్తున్నారు.

సరిగ్గా గమనిస్తే ఇంతకంటే ముఖ్యమైన హింట్ ఒకటి ఇచ్చారు పవన్ కల్యాణ్. కాస్త నర్మగర్భంగా వ్యాఖ్యానించినా… అది మాత్రం మామూలు హింట్ కాదని అంటున్నారు. అదేమిటంటే… ఓటు వేసే ముందు మన కులపోడా కాదా అన్నది చూడకండి.. మంచి చేస్తాడా లేదా అన్నది మాత్రమే పరిగణలోకి తీసుకోండి అని! కారణం… పిఠాపురం నియోజకవర్గంలో 30 శాతం వరకూ మాత్రమే కాపుసామాజికవర్గ ఓట్లు ఉంటాయి. మిగిలిన 70శాతంలో మాగ్జిమం ఓట్లు ఎస్సీ, బీసీ సామాజికవర్గ ఓటర్లవే! దీంతో… సరిగ్గా గమనిస్తే ఇదే పెద్ద హింట్ అని అంటున్నారు పరిశీలకులు!

సపోజ్ పవన్ ఈసారి కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. అందులో కచ్చితంగా ఒకటి మాత్రం పిఠాపురం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట!