ఈ రోజు తిరుపతిలో పవన్ ని కలుపుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి స్పీకర్ నాదెండ్ల మనోహర్.
నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి పెద్ద షాక్. ఆయన జన సేనలో చేరడం పవన్ కి పెద్ద ప్లస్ . ఎందుకంటే, తెలుగు రాష్ట్రాలలో హుందాగా రాజకీయాలు నడిపే వారిలో నాదెండ్ల మనోహర్. వివాదాలకు దూరంగా ఉంటాడు. ఇంతవరకు జనసేనలో చేరిన నాయకులంతా ఒక ఎత్తయితే, నాదెండ్ల మనోహర్ చేరడం మరొక ఎత్తు. నాదెండ్ల మనోహర్ చేరికతో జనసేన ఇమేజ్ బాగా పెరుగుతుంది. జనసేన నేత చట్టు ఉన్నవాళ్లంతా కాపులే అని అపవాదు వస్తున్నపుడు పెద్ద కమ్మనాయకుడు ఆ పార్టీలో చేరడం విశేషం. మనోహర్ లాంటి వాళ్లని, అంటే వివిధ కులాల ప్రముఖలను పవన్ తన పక్కన కనిపించేలా చేయడం తక్షణం అమలుచేయాల్సిన వ్యూహం. అపుడే పవన్ పార్టీ జనసేన అవుతుంది. నాదెండ్ల మనోహర్ రాకతో ఈ వ్యూహం అమలుజరగుతున్నదా అని పిస్తుంది.