పవన్ కళ్యాణ్ రథం తయారైందట.. ఆ రథం వల్ల ప్రయోజనం ఉందా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ రథం తయారు చేయించగా ఆ వాహనానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిలటరీ ట్రక్ తరహాలో ఉన్న ఈ వాహనంకు సంబంధించిన ఫోటోలను చూసి జనసైనికులు తెగ సంతోషిస్తున్నారు.

కోట్ల రూపాయలు ఖర్చు చేసి పవన్ కళ్యాణ్ ఈ రథాన్ని తయారు చేయించుకున్నారు. అయితే వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కు ఈ రథం వల్ల అణువంతైనా ప్రయోజనం ఉందా? అనే ప్రశ్నకు లేదనే సమాధానం వినిపిస్తోంది. మిలటరీ ట్రక్ మాదిరిగా ఈ ట్రక్ ఉండటం గమనార్హం. పవన్ పార్టీ 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

పవన్ ఈ వాహనానికి వారాహి అనే పేరు పెట్టారు. ఈ వాహనం లుక్ కూడా కొత్తగా ఉండటంతో పాటు ఎంతగానో ఆకట్టుకుంటోంది. పవన్ జనసేన పార్టీ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని మరి కొందరు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి కామెంట్లు వచ్చినా ఆ కామెంట్లను పట్టించుకోకుండా ముందడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

యుద్ధానికి సిద్ధం అని పవన్ ప్రచారం చేసుకుంటున్నా ఆ యుద్ధం ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి మారాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విమర్శలను పట్టించుకోకపోతే పవన్ పొలిటికల్ కెరీర్ కు నష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.