హాట్ టాపిక్: బాబు సన్నిహితుడికి పవన్ చెప్పుదెబ్బ!

మ‌చిలీప‌ట్నం వేదిక‌గా జ‌న‌సేన ప‌దో ఆవిర్భావ స‌భ ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేదిక‌పై నుంచి ఎప్ప‌ట్లాగే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడిన ప‌వ‌న్… దానికి కొనసాగింపుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల‌పైనా త‌న మార్క్ విమ‌ర్శ‌ల‌ను గుప్పించారు. అయితే గతంలో ఒకసారి చెప్పు చూపిస్తూ… చెప్పు తీసుకుని కొడతా.. చెప్పుతో కొడతా.. అంటూ పవన్ ఊగిపోయిన సంగతి తెలిసిందే. అయితే… మరోసారి చెప్పుదెబ మాటలు మాట్లాడారు పవన్. కాకపోతే ఈసారి వైకాపా నాయకులపై కాదు!

“వెయ్యి కోట్ల‌పై మాట్లాడితే చెప్పు దెబ్బ గ‌ట్టిగా ప‌డుతుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి నాకు రూ.1000 కోట్లు ఆఫ‌ర్ చేశారంట‌. ఆ వెయ్యి కోట్లు ఎక్క‌డున్నాయ‌ని వెతుక్కుంటున్నా. గ‌తంలోనూ ఇలాగే ప్యాకేజీ ఇచ్చారంటే.. చెప్పు చూపాను. తెనాలికి చెందిన వెంక‌టేశ్వ‌ర‌రావు చేసిన చెప్పుల్నే నేను వేసుకుంటా. పిచ్చిపిచ్చిగా వాగితే.. వాటితో కొడితే గ‌ట్టి దెబ్బ ప‌డుతుంది” అని ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పటికే పాఠకులకు అర్ధమైపోయి ఉండాలి.. పవన్ ఈ రేంజ్ లో ఫైరయ్యింది ఏ పత్రికాధిపతిపై అని! అవును… ఒక ప‌త్రికాధిప‌తికి చెప్పుదెబ్బ‌లు త‌ప్ప‌వ‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. దీంతో ప్రస్తుతం ఆ కథనం వండిన పత్రికాధిపతి విషయమే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది! ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఆ పత్రికాధిపతి, పవన్ దృష్టిలో సమర్ధుడైన చంద్రబాబుకు అత్యంత సన్నిహుతుడవ్వడం! ఆ విషయం తెలిసి కూడా పవన్ ఈస్థాయిలో నిప్పులు చెరగడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

కాగా… “వెయ్యి కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అయినా ఫ‌ర్వాలేదు. నేను స‌మ‌కూరుస్తాను. మీరు నాతో చేతులు క‌ల‌పండి అంటూ ప‌వ‌న్‌కు కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు” అని కొన్ని రోజుల క్రితం ఒక పత్రికలో భారీ కథనం వచ్చిన సంగతి తెలిసిందే!

YouTube video player