జగన్ హత్యకు పిల్ల కుంకతో ప్లాన్? సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్ పై దాడి నేపథ్యంలో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. మీడియా ఎదుట మాట్లాడిన ఆయన మేము మర్డర్ ప్లాన్ చేస్తే ఇలా ఉండదని అన్నారు. జగన్ ని హత్య చేయించాలి అనుకుంటే చంద్రబాబు ఇలా పిల్ల కుంకతో ప్లాన్ చేస్తారా అంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి.

మేము మర్డర్ ప్లాన్ చేస్తే ఇలా చిన్న కత్తితో గుచ్చుకోవడాలు, గిచ్చుకోవడాలు ఉండవంటూ పదునైన వ్యాఖ్యలు చేసారు. అర సెంటీమీటర్ గాయానికి ఏకంగా గవర్నర్ విచారణ అవసరమా అంటూ ఎద్దేవా చేసారు. ఒక గవర్నర్ ఒకే రాష్ట్రంలో 12 ఏళ్ళ పాటు ఉండటం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. నరసింహన్ పై కేంద్రానికి ఎందుకంత ప్రేమ అంటూ నిలదీశారు మంత్రి సోమిరెడ్డి.

గాయమైన తర్వాత కుట్లు వేయించుకోవడానికి నేరుగా హైదరాబాద్ పోవాలా? విశాఖలో డాక్టర్లు అని అడిగారు సోమిరెడ్డి. జగన్ పై దాడి విచారణ సీబీఐతో కాకుండా ఈడి, కెవి చౌదరి ఆధ్వర్యంలోని సీవీసీతో జరిపించాలన్నారు. జగన్ కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని విమర్శించారు. జగన్ పై జరిగిన దాడి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డ్రామాలో భాగమే అని ఆరోపించారు.

కాగా సోమిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను సినీ నటి, వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఖండించారు. ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డిని ఇలాంటి విషయాలకు పనికొస్తారనే చంద్రబాబు మంత్రిని చేసారని ఘాటు విమర్శలు చేసారు. సోమిరెడ్డికి సోది మాట్లాడటం తప్ప ఏమైనా తెలుసా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.