రోజాను జైలులో కూర్చోబెడతాను.. జనసేన నేత షాకింగ్ కామెంట్స్

Minister Roja

వైసీపీ మంత్రి రోజా ఈ మధ్య కాలంలో పలు వివాదాస్పద విషయాల ద్వారా వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయ్యారనే సంగతి తెలిసిందే. తాజాగా జనసేన నేత రోజాపై షాకింగ్ కామెంట్లు చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ రాజకీయ కక్షతో రోజా నన్ను అరెస్ట్ చేయించారని ఆయన అన్నారు. రోజాపై చేసిన వ్యాఖ్యల వల్ల నన్ను అరెస్ట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాది కంటే ఘోరంగా రాత్రి సమయంలో నన్ను అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.

తిరుపతిలో గంటన్నర పాటు తిప్పి రాత్రి 10.30 గంటల సమయంలో నన్ను నగరికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నగరి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత కానిస్టేబుల్ ఫోన్ నుంచి రోజా నాతో మాట్లాడటం జరిగిందని కిరణ్ రాయల్ అన్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి కూడా ఈ విధంగా మాట్లాడతావా అని ఆమె నన్ను ప్రశ్నించారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. నాపై పోలీస్ స్టేషన్ లో రెండు ఎఫ్.ఐ.ఆర్ లు కట్టారని ఆయన చెప్పుకొచ్చారు.

మంత్రి రోజా అధికార దుర్వినియోగంపై కేసు వేస్తున్నామని ఆయన తెలిపారు. నన్ను రోజా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆమెను కూడా అదే విధంగా 18 నెలల్లో జైలులో కూర్చోబెడతానని ఆయన కామెంట్లు చేశారు. 2024లో జనసేన కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కిరణ్ రాయల్ భావిస్తుండటం గమనార్హం. ఈ కామెంట్ల గురించి మంత్రి రోజా నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

జనసేన నేతలు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ తన వంతు సహాయ సహకారాలను అందిస్తుండటం గమనార్హం. రాజకీయ కక్షతో రోజా కేసులు పెడుతున్నారని జనసేన నేతల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రోజా వీలైనంత వరకు ఈ తరహా వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది సూచిస్తున్నారు. రోజా పొలిటికల్ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.