ప్రజలలో సినిమా సెలబ్రిటీలు అంటే ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే రాజకీయాలలో సినిమా సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ కొంతమేర వర్కౌట్ అయితే కొంతమేర వర్కౌట్ కాదు. అయితే సినిమా సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వస్తే మాత్రం సెలబ్రిటీలు కొంతమేర టెన్షన్ పడుతుంటారు. ఏపీలో జగన్ తెలంగాణలో కేసీఆర్ పవన్, జూనియర్ ఎన్టీఆర్ లను టార్గెట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో ఈ ఇద్దరు హీరోలను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం అభిమానుల సపోర్ట్ ఉండటంతో పాటు గుక్క తిప్పుకోకుండా అద్భుతంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా ఈ ఇద్దరు హీరోలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి.
అయితే ఏపీలో జగన్ పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తుండగా తెలంగాణలో కేసీఆర్ కూడా ఎన్టీఆర్ ను టార్గెట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సినీ హీరోలను టార్గెట్ చేయడం వెనుక వాళ్ల వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బీజేపీ తరపున ప్రచారం చేస్తారో లేదో అనే విషయాన్ని వెల్లడించడానికి ఆసక్తి చూపించడం లేదు.
అయితే భవిష్యత్తులో సీఎం కావాలనే ఆశ అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు పవన్ కళ్యాణ్ కు ఉంది. కాలం కలిసొస్తే మాత్రం ఈ ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాలపై దృష్టి పెడతారో లేక తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెడతారో తేలాల్సి ఉంది. సీఎంలు తమ ఫేవరెట్ హీరోలను టార్గెట్ చేయడం ఫ్యాన్స్ కు మాత్రం నచ్చడం లేదు.
