వారాహి ఎందుకు బటకురావడంలేదో తెలిసింది… !!

చాలా కాలం తర్వాత జనసేన అధినేత శనివారం, ఆదివారం అని వీకెండ్ చూడకుండా ఏపీలో అడుగుపెట్టారు. షూటింగ్ లేకపోవడమే కారణమో, లేకపోతే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఆబ్సెంట్ అయ్యిన ఫలితమో, అదీగాక డైరెక్టర్ కో హీరోయిన్ కో హెల్త్ బాగోలేకో… సమస్య ఏదైనా ఉన్నఫలంగ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన పవన్… రైతులపై ఉన్న ప్రేమతో వారిని పరామర్శించడానికి ప్రత్యేక హెలీకాఫ్టర్ లో రాజమండ్రి వచ్చారు. జనసైనికులు ఫుల్ హ్యాపీ…!

ఆ మండుటెండలో పవన్ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టుకుంటూ, నినాదాలు చేసుకుంటూ వారంతా వెంట వెళ్లే ప్రయత్నం చేశారు. ఎంత వేగంగా పరుగెత్తినా.. కారు వేగాన్ని అందుకోలేక అలిసిపోయారు. దీనికి సంబధించిన వీడియో జనసేన ట్విట్టర్ అకౌంట్ లో దర్శనమివ్వడం కొసమెరుపు. ఆ సంగతి అలా ఉంటే… పవన్ కనిపించిన ప్రతీసారీ వారాహి గురించిన చర్చ అటు మీడియాలోనూ, ఇటు జనసైనికుల్లోనూ జరుగుతుంటుంది. కారణం… దానికి పవన్ ఇచ్చిన బిల్డప్ అలాంటింది. ఫలితంగా దానిపై కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకం అటువంటిది.

పవన్ వరుసపెట్టి చేస్తున్న సినిమా టైటిల్స్ పై నిన్న మొన్నటి వరకూ చర్చించుకున్న జనసైనికులు… ఉన్నఫలంగా వారాహిపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.. ఇటు జగన్ వరుసపెట్టి జిల్లాల్లో తిరుగుతున్నారు.. చంద్రబాబు సైతం గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసుకుపోతున్నారు. లోకేష్నేమో రాయలసీమ జిల్లాలపై వదిలారు. ఇలా అంతా ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారు.. వరుసపెట్టి రాజకీయాలు ముమ్మరం చేసేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే… వారాహి మాత్రం ఇంకా షెడ్ లోనే ఉంది.. జనసేనాని ఇంకా సెట్ లోనే ఉన్నారు.

కక్కలేక మింగలేక జనసైనికులు చెందుతున్న ఆవేదన ఇది. సలహాలిసే చిన్నన్న నాగబాబు సీరియస్ అవుతారు.. ప్రశ్నిస్తే అనుమానించేవారు నావాళ్లు కాదంటూ అధినేత ఆగ్రహిస్తాడు… ఇంకెలా తమ బాధను చెప్పాలి, మరెలా తమ ఆవేదనను తెలియపరచాలని జనసైనికులు రోదిస్తున్నారు. పేరుకే సైనికులం కానీ… రోదనలో బాదితులం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఒక తాజాగా ఒక చర్చ జనసేన నాయకులతోపాటు, టీడీపీ నేతల్లో కూడా జరుగుతుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చిందంట. “మనల్ని ఎవడ్రా ఆపేది” అనే స్లోగన్ తో ఉన్న వారాహిని బాబు ఒక్క మాటతో ఆపారట. “ప్రస్తుతం రాజకీయాలు మనకు అనుకూలంగానే ఉన్నాయి.. చినబాబు పాదయాత్ర, తన రైతు భరోసా యాత్ర ముగిసే వరకూ వారాహిని షెడ్డులోనే ఉంచమని” సూచించారంట. “ఈ ఏడాదికి సినిమాల్లో బిజీగా గడుపుతూ… సీట్ల పంపకాలు అయిన అనంతరం… జనసేనకు కేటాయించిన సీట్లలో తిరిగితే చాలని” ఆర్డర్ జారీ వేశారంట.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ చర్చ సీరియస్ గా నడుస్తుంది. ఇది నిజంగా నిజమేనా.. లేక, రాజకీయ ప్రత్యర్థులు సృష్టిస్తున్న గాసిప్పా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే… ఈ ప్రచారంలో నిజాలు లేవని, ఇవన్నీ వైసీపీ నేతలు సృష్టిస్తున్న గాసిప్సే అని జనసైనికులు భావించాలంటే మాత్రం… వారాహి బయటకు రావాల్సిందే! అలాకానిపక్షంలో… పైన చెప్పుకున్న విషయం కన్ ఫాం అయినట్లే!!