వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. దాడి చేసింది ఎయిర్పోర్ట్లోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్గా గుర్తించారు. లాంజ్లో వెయిట్ చేస్తున్న జగన్కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు.
అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరారు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ ది అమలాపురంగా గుర్తించారు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ వీడియో కింద ఉంది చూడండి.