ఊహించని రీతిలో నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నాయకుడు పాలిటిక్స్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. టీడీపీ తరపున పాణ్యం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన బిజ్జం పార్ధసారధిరెడ్డి గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం మళ్ళీ రాజకీయాలలోకి వస్తాను అని ఆయనే స్వయంగా ప్రకటించడంతో నంద్యాలలో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన నంద్యాల ఎంపీ సీటుకై ప్రయత్నాలు చేస్తున్నట్టు నియోజకవర్గంలో టాక్. కాగా ఆయన ఏ పార్టీలో చేరతారు అని చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం కోసం కింద ఉన్న మ్యాటర్ చదవండి.

1999 లో పాణ్యం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బిజ్జం. ఆ తర్వాత 2004 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు రెండిటికి దూరంగా ఉన్నారు. ఇటీవలే ఆయన ఒక పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన అనుచరులు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు.

ప్రస్తుతం నంద్యాల వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ ఎస్పీవైరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో పోటీ చేయరని తెలుస్తోంది. ఆయన తన కూతురికో అల్లుడికో ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా అధిష్టానానికి విన్నపం పెట్టుకున్నారు. వైసీపీ నుండి ఎవరు పోటీ చేస్తారు అనేదానిపై జగన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఆయన ఏ పార్టీలో చేరతాడు అనేది సస్పెన్స్. కానీ ఆయన పెళ్ళికి హాజరైన సమయంలో ఏర్పాటు చేసిన పోస్టర్లు పసుపు రంగులో ఉన్న కారణంగా ఆయన టీడీపీ నుండి పోటీ చేస్తారు కాబోలు అనుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు.
