Chandrababu Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (ఏప్రిల్ 20) తన 76వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు తీపి కబురు అందింది. చంద్రబాబు పుట్టినరోజు కానుకగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు భారీ విరాళం ప్రకటించారు.
76వ పుట్టినరోజు – రూ.76 లక్షల విరాళం: చంద్రబాబు నాయుడు 76వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా, నారా భువనేశ్వరి రూ.76 లక్షల భారీ విరాళాన్ని అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం అందజేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అన్న క్యాంటీన్ సీఈవోకు ఆమె స్వయంగా అందజేశారు. అనుక్షణం పేదల సంక్షేమం కోసం పరితపించే చంద్రబాబు గారికి ఇంతకంటే గొప్ప పుట్టినరోజు బహుమతి మరొకటి ఉండదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం… pic.twitter.com/vMsCORmqZ2
— Nara Bhuvaneswari (@ManagingTrustee) April 19, 2026
రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని, ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు.
సాధారణంగా రూ.5లకే అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనాన్ని రేపు ఒకరోజు మాత్రం భువనేశ్వరి గారు ఇచ్చిన విరాళం ద్వారా ఉచితంగా వడ్డించనున్నారు.
ఈ విరాళంపై నారా భువనేశ్వరి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. ఆకలి తీర్చడమే అసలైన సంతృప్తి అని నారా భువనేశ్వరి అన్నారు.

“రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయి. రూ.5లకే పరిశుభ్రమైన వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న ఈ కేంద్రాల నిర్వహణకు విరాళం ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే మిన్నైన సేవ మరొకటి లేదు.” అని భువనేశ్వరి గారు పేర్కొన్నారు.
చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్ల వద్ద పేదలకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగనుంది.

