చంద్రబాబు నాయుడు ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నాలుగేళ్లు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చివరి ఆరు నెలలు మాత్రమే అమలు చేసి అన్ని పథకాలను అమలు చేశామని గొప్పగా ప్రచారం చేసుకునే విషయంలో చంద్రబాబు ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే టీడీపీ మేనిఫెస్టో విషయంలో ఇప్పటికీ పూర్తిస్థాయి క్లారిటీ లేదని సమాచారం అందుతోంది.
టీడీపీకి వైసీపీ అమలు చేస్తున్న హామీలనే అమలు చేయాలో లేక కొత్త హామీలను అమలు చేయాలో అర్థం కావడం లేదు. సాధారణంగా ఒక ప్రాంతీయ పార్టీ మరో ప్రాంతీయ పార్టీ అమలు చేస్తున్న అన్ని హామీలను కాపీ కొట్టడం సాధ్యం కాదు. అయితే అన్న క్యాంటీన్లను అమలు చేయడంతో పాటు అభివృద్ధికి సంబంధించి టీడీపీ హామీలను ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబుకు హామీల విషయంలో క్లారిటీ లేదని సమాచారం.
మరోవైపు పార్టీ నుంచి ఫండింగ్ ఇస్తే మాత్రమే టీడీపీ తరపున పోటీ చేస్తామని కొంతమంది అభ్యర్థులు చెబుతున్నారని తెలుస్తోంది. కోట్ల రూపాయల ఫండింగ్ కావాలని టీడీపీ నేతలు కోరుతుండటంతో ఏం చేయాలో చంద్రబాబుకు పాలుపోవడం లేదు. 2024 ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీకి భవిష్యత్తు ఉండదని రాజకీయ విశ్లేషకులు చేస్తున్న కామెంట్లు చంద్రబాబును మరింత భయపెడుతున్నాయి.
2024 ఎన్నికలు ఏపీలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఏ పార్టీకి బెనిఫిట్ కలిగిస్తాయో చూడాలి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ జనసేన కూటమి మధ్య పోటీ ఉండనుంది. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం చూపుతుందో లేదో క్లారిటీ లేదు. ప్రజల్లో పవన్ నమ్మకాన్ని కోల్పోతుండటంతో రాబోయే రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
