పవన్ కల్యాణ్ – చంద్రబాబులు తాజాగా ముసుగు తీసేశారు. ఇంతకాలం పరదాల మాటున చేసిన రహస్య రాజకీయాలు కాస్తా.. బహిరంగపరిచే ప్రయత్నం చేశారు. కారణం.. ఏపీ కోసం, ఏపీ అభివృద్ధి కోసం వారి కలయిక చాలా అవసరం అని వారిరువురూ చెబుతున్నారు. ఏపీని కాపాడే బాధ్యత తనదని అటు బాబు, ఇటు పవన్ లు ఊకదంపుడు కబుర్లు చెబుతున్నారు. అయితే ఈ కలయిక విషయంలో వారిద్దరూ ఒక బేసిక్స్ సెన్స్ ప్రశ్నను ఎదుర్కొంటున్నారు.
అవును… చంద్రబాబు – పవన్ కల్యాణ్ లు మళ్లీ (అధికారికంగా) కలవబోతున్నారు. పబ్లిక్ గా కలిసి పోటీచేయబోతున్నారు. అది కూడా ఏపీ ప్రయోజనలాకోసమే అని వారు చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో పవన్ – బాబు లకు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నారు ఏపీ ప్రజానికం. 2014 ఎన్నికల్లో ఎందుకు కలిశారు – 2019 లో ఎందుకు విడిపోయారు – 2024 మళ్లీ ఎందుకు కలుస్తున్నారు? ఈ సమాధానం సరిగ్గా సక్రమంగా చెప్పగలిగితే… వీరిద్దరికీ 175 ఇచ్చేసినా ఆశ్చర్యం లేదనేది ఈ సందర్భంగా విశ్లేషకుల అభిప్రాయం.
కారణం… నిజానికి 2014లో ఈ రెండు పార్టీలు కలిశాయి. ఆ ఎన్నికల్లో ప్రజల తరుపున చంద్రబాబును ప్రశ్నిస్తానని, తనను నమ్మి ఓటు వేయమని పవన్ చెప్పుకున్నారు. అనంతరం పరదాల చాటుకు పోయారు. ఇద్దరూ కలిసి.. బీజేపీతో కలిసి.. రాష్ట్రానికి చేయాల్సిన ద్రోహం మొత్తం చేశారు. వారి వారి చేతకాని తనాలను ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో పవన్ కు సున్నా స్థానాలు, జనసేనకు 1 స్థానం రాగా.. టీడీపీకి చావుతప్పి కన్నులొట్టబోయి… 23స్థానాలొచ్చాయి.
అసలు.. అపుడు ఎందుకు కలిశారు? ఆ తరువాత ఎందుకు విడిపోయారు? మల్లీ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అనే బేసిక్ ప్రశ్నకు ఈ పార్టీలు జవాబు చెప్పాల్సిన అవసరం కచ్చితంగా ఉంది! పైగా వీరు చెబుతున్న పాత చింతకాయ పచ్చడి కబుర్లు… “మేము ఏపీ ప్రయోజనాల కోసం కలుస్తున్నామని”! దీంతో… ఎవరి చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నారు అనే సెటైర్లు మొదలైపోతున్నాయి. కారణం… ఈ రెండు పార్టీలు కలిసేది వారి సొంత ప్రయోజనాల కోసం. వారి రాజకీయాల అవసరాల కోసం. వారి వారి పార్టీల మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా కాపాడుకోవడం కోసం!
ఇలా వస్తున్న కామెంట్లు తప్పు అని వారిరువురూ చెప్పాలని భావిస్తే… పైన పేర్కొన్న బేసిక్ సెన్స్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.. చెప్పి తీరాలి!!
