2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి భారీ షాక్.. అన్ని సీట్లు మాత్రమే వస్తాయా?

Will TDP take over Anantapur Corporation?

2024 ఎన్నికల ఫలితాలలో వైసీపీకి భారీ షాక్ తప్పదా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించినప్పటికీ 2024లో వైసీపీకి భారీ షాకులు తప్పవని తెలుస్తోంది. తాజాగా ఆత్మసాక్షి సర్వేలో ఏపీలో టీడీపీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని తేలింది. టీడీపీకి ఏకంగా 95 స్థానాలలో విజయం దక్కుతుందని వెల్లడైంది.

వైసీపీ 75 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉండగా జనసేన 5 స్థానాలలో విజయం సాధించే ఛాన్స్ అయితే ఉందని వెల్లడైంది. 43 వేర్వేరు అంశాలకు సంబంధించి ఈ సర్వే జరిగిందని బోగట్టా. ఓటర్లను 20 వర్గాలుగా విభజించి ఈ సర్వే చేశారని సమాచారం అందుతోంది. సర్వేలో ఎక్కువమంది టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని వెల్లడించారని బోగట్టా. టీడీపీకి 44.5 శాతం వైసీపీకి 43 శాతం ఓట్లు పోల్ అవుతాయని ఈ సర్వేలో వెల్లడైంది.

అయితే టీడీపీ, వైసీపీ మధ్య తేడా చాలా తక్కువ కావడంతో 2024 ఎన్నికల సమయానికి ఈ ఫలితాలలో స్వల్పంగా మార్పు ఉండే అవకాశం ఉంది. 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. జిల్లాల వారీగా ఈ సంస్థ ఫలితాలను ప్రకటించడం గమనార్హం. వైసీపీ చేస్తున్న తప్పులే ఈ ఫలితాలకు కారణమని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం తెలుగుదేశంకు ప్లస్ అవుతుందని వైసీపీకి షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ఇప్పటికైనా ఈ విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది. జగన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.