మోదీని ‘తెల్లగడ్డమోడు’ అన్న జెసి

ఆయన ఏం మాట్లాడినా సంచలనమే..అదే మాటలో హాస్యం, వ్యంగ్యం, చతురత అన్నింటిని కలగలిపి శత్రువును నొప్పించకుండా దెబ్బకొడతాడు. ఏం మాట్లాడినా ఎంతటి వారినైనా సరే ముఖం మీదే అనేస్తాడు. ఆయనే  అనంతపురం జిల్లా ఎంపీ… జెసి దివాకర్ రెడ్డి.  అనంతపురం లో ఎంపీలు చేపట్టిన నిరసన దీక్షలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

కియా మోటార్స్ ను అనంతపురం రాకుండా ఓ దుర్మార్గుడున్నాడే తెల్లగడ్డం పెంచుకునే వెధవా నరేంద్రమోదీ… కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ కు రాకుండా ఐదుసార్లు అడ్డుపడ్డాడని విమర్శించారు. దానిని తన సొంత రాష్టం గుజరాత్ కి తరలించుకుపోవాలని చూశాడు. కానీ  మనోడు చంద్రబాబు చాలా గట్టోడు కాబట్టి కాళ్లు పట్టుకొనో, చేతులు పట్టుకొనో , వారికి లడ్డులిచ్చో మొత్తానికి ఏదో రకంగా కియా మోటార్స్ ను అనంతపురం జిల్లాకు వచ్చేలా కృషి చేశాడన్నారు.

కరువు సీమకు నీళ్లు తెచ్చిన ఘనత చంద్రబాబునాయుడుదని జేసీ అన్నారు. జగన్ నీవు కావాలంటే నీ ఊరికి పోయి సూడు… చంద్రబాబు గండిపేట నుంచి పంపింగ్ ద్వారా నీళ్లు అందిస్తున్నారు. అవి నీళ్లో కావో తెలుస్తది. అప్పటికీ కూడా నీవు మారకపోతే నిన్ను ఆ ఏసుప్రభే కాపాడాలిరా బాబు అని చమత్కరించారు. నేను చంద్రబాబు నాయుడుని పొగిడే ప్రసక్తే లేదు… ఎందుకు పొగడాలి అని ప్రఃశ్నించారు. నాకేమైనా మంత్రి పదవులిచ్చాడా.. నాకన్న చిన్నవాడు కాల్వ శ్రీనివాసులుకు మంత్రి పదవి ఇచ్చాడు. సునీతమ్మకు ఇచ్చాడు. మరీ నేనేందుకు పొగడాలన్నారు. వారికి మంత్రి పదవులు వచ్చాయని తనకేమి ఈర్షలేదన్నారు.కానీ చంద్రబాబు చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పాల్సిన  బాధ్యత తనపై ఉందన్నారు.

 

ఇక ఇద్దరు నేతలు ఉన్నారు నేను సీఎం అంటే నేనే సీఎం అని ఒకడేమో కాళ్లేసుకొని తిరుగుతున్నాడు. మరొకడేమో నోరేసుకొని తిరుగుతున్నాడన్నారు. ఒకడు జగన్ ఇంకొకడు సినీ హీరో పవర్ పవన్ అని అన్నారు. మరీ వీరిద్దరు సీఎం అయితే రాజీ కుదిర్చేది ఎవరంటే ఆ మోదీ అని చమత్కరించారు.

 

మొత్తానికి జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ కాస్త దూకుడు పెంచి సంచలన వ్యాఖలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు సభలో ఆద్యంతం నవ్వులే విరబూశాయి. జెసి స్పీచ్ వింటే మోదీ, పవన్, జగన్ లు కూడా నవ్వుకుంటారేమో అని అక్కడున్న నేతలు, ప్రజలు అనుకున్నారని  ఓ నేత అన్నారు.