సన్నీ లియోన్ నటించిన తాజా చిత్రం అర్జున్ పటియాలా. సన్నీ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు దిల్జీత్ దొసాన్జ్, వరుణ్ శర్మ, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. జూలై 26న చిత్రం విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిత్రంలోని ఓ సన్నివేశంలో సన్నీ తనకి కాల్ చేయమని దిల్జీత్కి ఫోన్ నెంబర్ ఇస్తుంది. అదే సన్నీ ఒరిజినల్ నెంబర్ అనుకొని భావించిన జనాలు ఆ నెంబర్కి వరుస కాల్స్ చేయడం మొదలు పెట్టారట. రోజుకు 150 ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ వాసి పునీత్ అగర్వాల్ తన గోడుని ఇటీవల వెళ్లబుచ్చుకున్నాడు. ఒక్కోసారి అసభ్యంగా కూడా మాట్లాడుతున్నారట. దీనిపై విసుగు చెందిన పునీత్ ‘అర్జున్ పటియాలా’ సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని కూడా భావించాడు. ఈ నేపథ్యంలో సన్నీలియోన్ ఎట్టకేలకి స్పందించింది. ఇలా జరగుతుందని అస్సలు ఊహించలేదని చెబుతూ పునీత్కి క్షమాపణలు తెలిపింది.