నటుడు సుధీర్ కెరిర్ ఆశాజనకంగా సాగటంలేదు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ , వెనక నుంచి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నా సినిమాలు విజయవంతం కావడం లేదు. “నన్నుదోచుకుందువటే ” సినిమా స్వంతంగా నిర్మించాడు. కానీ ఈ సినిమా మీద పెట్టుకున్న ఆశలు నీరు కారిపోయాయి.
నారా రోహిత్ తో కలసి చేసిన ‘వీర భోగ వసంత రాయలు” కూడా నిరాశ పరిచింది. దీంతో సుధీర్ బాబు మెంటల్ గా అప్సెట్ అయ్యాడట. ఈ మధ్యలోనే తన కుమారుడును పంచల కార్యక్రమం నిర్వహించి కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు.
ఇక ఇప్పుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ మీద ద్రుష్టి పెట్టాడు. చాలా కాలం క్రితమే ఈ సినిమా ప్రకటించాడు. సుధీర్ బాబు ఒకప్పుడు బాట్మింటన్ బాగా ఆడేవాడు. ఇప్పుడు గోపీచంద్ బయోపిక్ కోసం మళ్ళీ బ్యాట్ పట్టుకున్నాడు. చాలా కాలం తరువాత పాత ప్రేయసిని కలిసి నట్టు వుంది అని వ్యాఖ్యానించాడు సుధీర్ బాబు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యేది చెప్పలేదు. ఖాళీగా వుంటమెందుకని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
