ఛార్మీ నే సహ నిర్మాత…అందుకే ఆమే ప్రకటించింది

క్రిసమస్ పర్వదినం సందర్బంగా ఈ రోజు మాజీ హీరోయిన్ ఛార్మి ఓ ప్రకటన చేసింది. ఆమె సహ నిర్మాతగా వ్యవహించనున్న చిత్రం గురించిన ప్రకటన అది. ఇప్పటికే మీరు గెస్ చేసి ఉంటారుకదా..దర్శకుడు ఎవరో..యస్ పూరి జగన్నాథే ఆ ప్రాజెక్టు డైరక్టర్, రామ్ హీరో.

వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ తన కుమారుడుతో చేసిన ‘మెహబూబా’ సైతం డిజాస్టర్ కావటంతో ఏ హీరోతో నెక్ట్స్ ప్రాజెక్టు చేయాలనే డైలమోలో పడ్డారు. ఈ లోగా ఆయనకు రామ్ టచ్ లోకి వచ్చారు. ఎప్పటినుంచి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎదురుచుస్తున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కలిసి ఓ కథని వర్కవుట్ చేసి, ఈ రోజు ప్రకటన ఇచ్చారు.

వచ్చేనెల నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 2019 జనవరిలో ప్రారంభించి మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పూరి భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నటి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ మూవీకి సంబంధించి టైటిల్‌, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. త్వరలో వెల్లడించనున్నారు.

రామ్‌-పూరీ కాంబినేషన్‌లో రాబోతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇటీవల ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రామ్‌. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వర్కవుట్ కాలేదు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత హీరోయిన్ గా నటించారు.